Telugu Gateway
Telangana

తెలంగాణ స్పీక‌ర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా

తెలంగాణ స్పీక‌ర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా
X

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా అని తేలింది. సాధార‌ణ వైద్య ప‌రీక్షల స‌మ‌యంలో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. బుధ‌వారం రాత్రి చేయించిన కోవిడ్ టెస్ట్‌లో తనకు కరోనా పాజిటివ్ అని నమోదు అయినట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస‌రెడ్డి వెల్ల‌డించారు. ప్రస్తుతం తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు ఏఐజీ, గచ్చిబౌలి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యానని తెలిపారు.

గత కొన్ని రోజులుగా తనను కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కోవిడ్ టెస్ట్ చేయించుకుని తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని స్పీకర్ పోచారం వినతి చేశారు. ఇటీవల పోచారం మనవరాలి పెళ్లికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ హాజరైన విషయం తెలిసిందే. ఈ పెళ్లికి రెండు రాష్ట్రాల‌కు చెందిన ప‌లువురు వీఐపిలు హాజ‌ర‌య్యారు.

Next Story
Share it