Telugu Gateway
Telangana

తెలంగాణలో మే 31 వరకూ పాఠశాలకు సెలవులు

తెలంగాణలో మే 31 వరకూ పాఠశాలకు సెలవులు
X

వేసవి సెలవులపై తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా ఇప్పటికే స్కూళ్ళను మూసివేశారు. పదవ తరగతి పరీక్షలు కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే. సెలవుల అంశంపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం నాడు ప్రకటన చేశారు. 'ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి వేసవి సెలవుల నిర్ణయంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్షించారు.

కరోనా విస్తరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశాం. పాఠశాలలు, జూనియర్ కళాశాలలను తరువాత ఎప్పుడు తెరిచేది కోవిడ్ - 19 పరిస్థితిని అనుసరించి జూన్ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఏప్రిల్ 26వ తేదీని ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దినంగా పరిగణిస్తాం' అని మంత్రి పేర్కొన్నారు.

Next Story
Share it