Telugu Gateway
Telangana

ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాక తెలంగాణ ఉద్యోగులకు పీఆర్సీ

ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాక తెలంగాణ ఉద్యోగులకు పీఆర్సీ
X

తెలంగాణ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీఆర్సీ ప్రకటనకు త్వరలోనే మోక్షం లభించేలా కన్పిస్తోంది. ముఖ్యమంత్రి కెసీఆర్ మంగళవారం నాడు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పీఆర్సీ తోపాటు పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ విషయాలను ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. 'ఎన్నికల నియమావళి ఉన్నందున ప్రకటన చేయలేకపోతున్నాం అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎన్నికలు ముగిసిన తరువాత పీఆర్సీ ప్రకటన వస్తుంది. ఉద్యోగుల పదవి విరమణ వయస్సు కూడా త్వరలోనే అమలు చేస్తాం. ఎపి లో ఉన్న ఉద్యోగులను తెలంగాణ కు తీసుకురావడానికి సీఎం కేసీఆర్ అంగీకారం చేశారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నియమావళి కి లోబడి ఇవాళ సీఎం కేసీఆర్ తో చర్చించాము. 2014 తరువాత దేశంలోనే తెలంగాణ లో అత్యధిక పీఆర్సీ సీఎం కేసీఆర్ ఇచ్చారు.

ఉద్యోగుల ప్రమోషన్ లు కూడా చాలా త్వరితగతిన ఇచ్చారు. పీఆర్సీ వాళ్ళు ఎంత రికమండ్ చేసిన మీకు ఎంతో ఇవ్వాలో ఇస్తాం మీకు జన్యున్ గా రావల్సిన పీఆర్సీ వస్తుంది. సీపీఎస్ ఉద్యోగుల కుటుంబలకు పెన్షన్ స్కిం అమలు చేస్తాం అన్నారు. ఎపి కంటే ఎక్కువే పీఆర్సీ ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. .ఉద్యోగుల సమస్యలు పరిస్కరం చేసే దిశగా సీఎం కేసీఆర్ హామీలు ఇచ్చారు.సీఎం కేసీఆర్ ను మేమే అపాయింట్మెంట్ కోరాం ఎన్నికల నియమావళి ఉన్నందున వచ్చి కలుస్తాం అన్నారు. పీఆర్సీ పై చాలా స్పష్టంగా చెప్పారు. సీఎం కేసీఆర్ పై నమ్మకం ఉంది.' అని తెలిపారు.

Next Story
Share it