భూములు అమ్మి స్కీములు అమలు కూడా గొప్పేనా?

కానీ ఒక వైపు భూములు అమ్ముకుంటూ....మరో వైపు ఓఆర్ఆర్ వంటి ప్రాజెక్ట్ లను దీర్ఘకాలానికి లీజ్ కు ఇచ్చి వేల కోట్ల రూపాయలు ఖజానాలో జమ చేసుకుని...ఆ నిధులను కూడా ఎన్నికల ముందు రాజకీయ అవసరాల కోసం వాడినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇలా ఎన్నికల ఏడాదిలో ఎడా పెడా కెసిఆర్ సర్కార్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కంటే దారుణంగా వరసగా పత్రికల్లో యాడ్స్ ఇచ్చి మరీ ఎకరాల లెక్కన...గజాల లెక్కన ప్రభుత్వ భూములు అమ్మిన విషయం తెలిసిందే. కెసిఆర్, కేటీఆర్ లు చెప్పుకుంటున్నట్లు రాష్ట్రానికి పదేళ్లుగా అద్భుత పాలన ఇచ్చి సంపద సృష్టించి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చినట్లు. ఆ అమ్మే భూములు కూడా అత్యంత కీలకమైన ప్రాంతాల్లో అస్మదీయ కంపెనీలనే రంగంలోకి దింపినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇవన్నీ చూస్తుంటే కెసిఆర్ చెప్పే మాటలకూ..క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు మధ్య మిస్ మ్యాచ్ అవుతుంది అనే చెప్పొచ్చు. ఇవన్నీ చూస్తున్న తెలంగాణ ప్రజలు నవంబర్ 30 న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.