Telugu Gateway
Telangana

కెటీఆర్ కూ కరోనా పాజిటివ్

కెటీఆర్ కూ కరోనా పాజిటివ్
X

తెలంగాణ మున్సిపల్, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ కూడా కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తతం తాను ఐసోలేషన్ లో ఉన్నట్లు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తనను కలసి వారు కరోనా ప్రొటోకాల్ ప్రకారం పరీక్షలు చేయించుకుని, జాగ్రత్తలు తీసుకుకోవాలని సూచించారు. ట్విట్టర్ ద్వారా కెటీఆర్ ఈ విషయం వెల్లడించారు

. ఇటీవలే కరోనా సోకి చికిత్స తీసుకుంటున్న సీఎం కెసీఆర్ టెస్ట్ ల కోసం సోమాజీగూడ యశోదా ఆస్పత్రికి వచ్చినప్పుడు ఎంపీ సంతోష్ తోపాటు మంత్రి కెటీఆర్ కూడా వెళ్ళారు. వారిలో ఎంపీ సంతోష్ కు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా గురువారం నాడు వెల్లడించారు. ఇప్పుడు కెటీఆర్ కూడా కరోనా బారినపడడ్డారు.

Next Story
Share it