Telugu Gateway
Telangana

ఇంట‌ర్ ప‌రీక్షలు ర‌ద్దు..ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు

ఇంట‌ర్ ప‌రీక్షలు ర‌ద్దు..ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు
X

తెలంగాణ‌లో ఇంట‌ర్ ప‌రీక్షలు ర‌ద్దు చేసిన‌ట్లు బుధ‌వారం ఉద‌యం అంతా వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే మ‌ధ్యాహ్నానికి విద్యా శాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చారు. ప‌రీక్షల ర‌ద్దుపై ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేద‌ని..స‌మీక్ష త‌ర్వాత తుది నిర్ణ‌యం వెలువ‌డుతుంద‌ని వెల్ల‌డించారు. నిర్ణ‌యం తీసుకోగానే వెల్ల‌డిస్తామ‌న్నారు. మంగ‌ళ‌వారం జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో దీనిపై చ‌ర్చ జ‌రిగింది. అయితే నిర్ణ‌యం మాత్రం వెల్ల‌డించ‌లేదు.

Next Story
Share it