Telugu Gateway
Telangana

తెలంగాణలో బాణాసంచాపై నిషేధానికి హైకోర్టు ఆదేశం

తెలంగాణలో బాణాసంచాపై నిషేధానికి హైకోర్టు ఆదేశం
X

ఈ దీపావళి వెలుగులను మిస్ చేయనుంది. ఇంచుమించు దేశం అంతా ఇదే పరిస్థితి. పలు రాష్ట్రాలు ఇప్పటికే బాణాసంచా అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధించాయి. పలు రాష్ట్రాలు కేవలం గ్రీన్ క్రాకర్స్ కు అదీ రెండు గంటల పాటు మాత్రమే అనుమతిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ తరుణంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీపావళి పండుగ సందర్భంగా టపాసులను బ్యాన్ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశించింది. అమ్మకాలతోపాటు వినియోగాన్ని నిలుపుదల చేయాలన్నారు. కరోనాను దృష్టిలో పెట్టుకుని దీపావళి పండుగ లో క్రాకర్స్ కాల్చకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు లో న్యాయవాది ఇంద్రప్రకాష్ ప్రయోప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా ఉన్నాయని ఈ సమయంలో క్రాకర్స్ కాల్చడం వలన ప్రజలు ఇబ్బందులు పడతారని అందులో పేర్కొన్నారు. క్రాకర్స్ వలన ప్రజలు శ్వాస కోశ ఇబ్బందులు పడే అవకాశం ఉందని తెలిపారు. పిటీషనర్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్రాకర్స్ బ్యాన్ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశం. ఇప్పటి వరకు తెరచిన షాపులను మూసి వేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే రాజస్థాన్ హైకోర్టు బ్యాన్ చేసిందని తెలిపారు. కలకత్తా లో కూడా బ్యాన్ చేయకపోతే సుప్రీంకోర్టు బ్యాన్ చేయాలని ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది. ఈ అంశాలు అన్నీ గమనంలోకి తీసుకుని ఎవరూ క్రాకర్స్ అమ్మడం గాని , కొనడం గాని చేయొద్దన్న హైకోర్టు. ఎవరైనా అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలన్నారు. ప్రచార మాధ్యమాల ద్వారా క్రాకర్స్ కాల్చకుండా ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని హైకోర్టు అదేశం. ఈ నెల 19 న ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది.

Next Story
Share it