Telugu Gateway
Telangana

తెలంగాణలో లాక్ డౌన్ మే 30 వరకూ పొడిగింపు

తెలంగాణలో లాక్ డౌన్ మే 30 వరకూ పొడిగింపు
X

ముఖ్యమంత్రి కెసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు అవుతున్న లాక్ డౌన్ ను ఈ నెల 30 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులందరితో మంగళవారం ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలను సిఎం కెసిఆర్ తెలుసుకున్నారు. క్యాబినెట్ మంత్రులందరి అభిప్రాయాలను సేకరించిన మేరకు సిఎం కెసిఆర్ లాక్ డౌన్ ను మే 30 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం ఆదేశించారు.

కరోనా నియంత్రణా కార్యక్రమాల్లో, వైద్య సేవల పర్యవేక్షణలో భాగంగా మంత్రులు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బిజీగా వున్నందున ఈ నెల 20 న జరుప తలపెట్టిన క్యాబినెట్ మీటింగును సిఎం రద్దు చేశారు. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు సర్కారు ప్రకటించింది. అయినా సరే లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Next Story
Share it