Telugu Gateway
Telangana

బీజేపీ రెండవ జాబితాలో ఆరుగురికి చోటు

బీజేపీ రెండవ జాబితాలో ఆరుగురికి చోటు
X

తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ రఘునందన్ రావు కు మెదక్ లోక్ సభ సీటు దక్కింది. బుధవారం నాడు బీజేపీ విడుదల చేసిన రెండవ జాబితాలో ఆయన పేరు ఉండటంతో ఇంత కాలం మెదక్ లోక్ సభ బీజేపీ సీటు ఎవరికి దక్కుతుంది అనే సస్పెన్స్ కు తెరపడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రఘు నందన్ రావు దుబ్బాక నుంచి పోటీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. రెండవ జాబితాలో తెలంగాణ నుంచి ఆరుగురికి సీట్లు ప్రకటించారు. ఇందులో మెదక్ సీటు రఘునందన్ రావు కు దక్కగా ఆదిలాబాద్ సీటు గోడెం నగేష్ కు, మహబూబాబాద్ సీటు సీతారాం నాయక్ కు, నల్గొండ సైదిరెడ్డి కి, మహబూబ్ నగర్ డీ కే అరుణకు, పెద్దపల్లి సీటు గోమాస శ్రీనివాస్ కు కేటాయించారు. దీంతో ఇప్పటి వరకు బీజేపీ తెలంగాణాలో 15 సీట్లకు అభ్యర్థులను ప్రకటించినట్లు అయింది.

అయితే ఖమ్మం, వరంగల్ సీట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ లోక్ సభ సీట్లు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా కీలక నేతలు తెలంగాణ పై ఫోకస్ పెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమి పలు కావటంతో ఆ స్థానాన్ని ఆక్రమించే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే అటు బిఆర్ఎస్ తో వివిధ పార్టీ ల నుంచి వచ్చిన వాళ్ళను చేర్చుకుంటూ సీట్లు కూడా కేటాయిస్తోంది. మరో వైపు తెలంగాణ లో అధికార కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలవటంపైని ఫోకస్ పెట్టింది.

Next Story
Share it