సంచలనం..జీతాలు పెంచాలని టీ న్యూస్ ఉద్యోగుల ధర్నా
టీ న్యూస్. ఇది ముఖ్యమంత్రి కెసీఆర్ కుటుంబ సభ్యుల ఛానల్. విచిత్రం ఏమిటంటే ఈ ఛానల్ ఉద్యోగులు జీతాలు పెంచాలంటూ ధర్నాకు దిగటం. అది కూడా కార్యాలయం ఆవరణలోనే. రెండున్నర సంవత్సరాలుగా తమకు జీతాలు పెంచలేదని..దీంతో చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నామని..యాజమాన్యం పట్టించుకోకపోవటంతో పెన్ డౌన్ చేశామని ఉద్యోగులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు మీడియా వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలో ఎక్కడా లేని రీతిలో జీతాలు పెంచామని ఓ వైపు సీఎం కెసీఆర్ చెబుతుంటే.. కెసీఆర్ కుటుంబ సభ్యులు నడిపే చానల్ ఉద్యోగులు జీతాలు పెంచాలంటూ ధర్నాకు దిగటం సంచలనం మారింది. అధికారిక ప్రత్రిక, ఛానల్ కు అటు ప్రభుత్వపరంగా..ఇటు పార్టీపరంగా భారీ ఎత్తునే ప్రకటనలు వస్తున్నాయి. అయినా సరే మరి ఉద్యోగులను ఎందుకు చాలీచాలని జీతాలు ఉన్నాయనేది పెద్ద ప్రశ్న. నిజంగా ఇది అధికార పార్టీకి పెద్ద అవమానం కూడా. ఉద్యోగుల ధర్నాతో అయినా యాజమాన్యం స్పందించి వీరి సమస్య పరిష్కరిస్తుందో లేదో వేచిచూడాల్సిందే.