Telugu Gateway
Telangana

తెలంగాణలో డెల్టా ప్లస్ కేసుల్లేవ్

తెలంగాణలో డెల్టా ప్లస్ కేసుల్లేవ్
X

క‌రోనాకు సంబంధించి ఇప్పుడు కొత్త‌గా విన్పిస్తున్న వేరియంట్ డెల్టా ప్ల‌స్. దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో ఈ కేసులు న‌మోదు అవుతున్నాయి. అయితే తెలంగాణ‌లో ఇప్ప‌టివ‌ర‌కూ డెల్టా ప్ల‌స్ కేసులు న‌మోదు కాలేద‌ని తెలంగాణ హెల్త్ డైర‌క్ట‌ర్ జి. శ్రీనివాస‌రావు వెల్ల‌డించారు. అయినా స‌రే ప్ర‌జ‌లు అంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరారు. దేశంలో డెల్టా ప్లస్ రకం కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ వేరియంట్ కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో డీహెచ్ శ్రీనివాస రావు.. గురువారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో డెల్టా ప్లస్ వేరియంట్ కరోనా కేసులు నమోదు కాలేదని తెలిపారు. ఈ వేరియంట్ కేసు ఒక్కటి కూడా వెలుగులోకి రాలేదని వెల్లడించారు. తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు.రాష్ట్రంలో ఇప్పటి వరకు 97 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు తెలిపారు.

వారిలో 83 లక్షల మంది తొలి డోసులో వ్యాక్సిన్ తీసుకున్నట్టు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 100 కేంద్రాలు, 24 మొబైల్ వ్యాన్స్ ద్వారా వ్యాక్సినేషన్ చేస్తున్నట్టు తెలిపారు. బుధవారం నుంచి 30 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలు ఇస్తున్నట్టు వెల్లడించారు. విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీచర్లు ఐడీ కార్డు చూపించి వ్యాక్సిన్ తీసుకోవచ్చునని అన్నారు. త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో కోటి మందిని వ్యాక్సినేష‌న్ పూర్తికానుంద‌ని తెలిపారు. జులైలో తెలంగాణ‌కు 21 ల‌క్షల డోసులు వ‌స్తాయ‌న్నారు.

Next Story
Share it