Telugu Gateway
Telangana

హత్య చేసి..శవాన్ని ఫ్రిజ్ లో పెట్టారు

హత్య చేసి..శవాన్ని ఫ్రిజ్ లో పెట్టారు
X

హైదరాబాద్ లో కలకలం. ఓ వ్యక్తిని చంపేసి గుట్టుచప్పుడు కాకుండా ఫ్రిజ్ లో పెట్టేశారు. ఆ ఇంట్లో నుంచి దుర్వాసన రావటంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ విషయం వెలుగు చూసింది. జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహ్మత్ నగర్ డివిజన్ కార్మిక నగర్‌లో ఈ దారుణం వెలుగు చూసింది. మహమ్మద్ సిద్ధిక్ (35) అనే వ్యక్తి కార్మిక నగర్‌లోని ఓ భవంతిలో టైలరింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు.

గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత ఫ్రిజ్ లో పెట్టి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. అయితే ఈ హత్య జరగటానికి రెండు రోజుల ముందు అతని భార్య రుబీనా పుట్టింటికి వెళ్లిందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ హత్యకు కారణాలు ఏమిటనే అంశంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది.

Next Story
Share it