Telugu Gateway
Telangana

టీఆర్ఎస్ ఎంపీకి షాక్..ఆరు నెల‌ల జైలు శిక్ష

టీఆర్ఎస్ ఎంపీకి షాక్..ఆరు నెల‌ల జైలు శిక్ష
X

ఓ ఎన్నిక‌ల కేసుకు సంబంధించి ప్ర‌జాప్ర‌తినిధుల కోర్టు టీఆర్ఎస్ ఎంపీకి షాకిచ్చింది. 2019 ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంపిణీ చేశారన్న ఆరోపణలతో మాలోత్ కవితపై బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటినుంచి ఈ కేసుపై విచారిస్తున్న న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది.

కవిత ఓటర్లను ప్రలోభపెట్టారని ఆరు నెలల జైలు శిక్ష విధించింది. జరిమానా రూ.10వేలు కట్టిన ఎంపీకి తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె అదికార టీఆర్ఎస్ త‌ర‌పున మ‌హ‌బూబాబాద్ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

Next Story
Share it