Telugu Gateway
Telangana

టీఆర్ఎస్ సిటీ ఆఫీసుకు వంద కోట్ల స్థ‌లమా?. రేవంత్ ఫైర్

టీఆర్ఎస్ సిటీ ఆఫీసుకు వంద కోట్ల స్థ‌లమా?. రేవంత్ ఫైర్
X

తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) హైద‌రాబాద్ కార్యాల‌యం కోసం బంజారాహిల్స్ లో కోట్లాది రూపాయ‌ల విలువ చేసే భూమి కేటాయించ‌టంపై రాజ‌కీయ దుమారం రేగుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్, బిజెపిలు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. తాజాగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇదే అంశంపై ట్విట్ట‌ర్ లో స్పందించారు. అందులో ఆయ‌న ఈ భూ కేటాయింపుల‌కు సంబందించిన జీవోను కూడా జోడించారు.

'దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి భూమి లేదు. గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి లేదు. టీఆర్ఎస్ జిల్లా ఆఫీసుకు నగరం నడిబొడ్డున రూ.100 కోట్ల విలువైన భూమి అప్పనంగా కొట్టేయడానికి భూమి ఉంది. ఎవని పాలయిందిరో తెలంగాణా.జాతి సంపద దోస్తున్నవాడి పాలయిందిరో తెలంగాణ' అంటూ పేర్కొన్నారు. ఇదే అంశంపై బిజెపి తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజ‌య్ కూడా తీవ్రంగా స్పందించారు.

Next Story
Share it