Telugu Gateway
Telangana

దేవేంద‌ర్ గౌడ్ తో రేవంత్ రెడ్డి భేటీ

దేవేంద‌ర్ గౌడ్ తో రేవంత్ రెడ్డి భేటీ
X

తెలంగాణకు చెందిన కీల‌క నేత, మాజీ మంత్రి దేవేంద‌ర్ గౌడ్ తో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రేవంత్ తోపాటు కాంగ్రెస్ ప్ర‌చార క‌మిటీ కన్వీన‌ర్ మ‌ధు యాష్కీ గౌడ్, మ‌ల్లు ర‌వి కూడా ఉన్నారు. దేవేంద‌ర్ గౌడ్ తో భేటీ అనంత‌రం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేవేందర్ గౌడ్‌ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చామని తెలిపారు. ఆయన ఆలోచన తెలంగాణ ప్రజలకు ఉపయోగపడాలన్నారు. దేవేందర్ గౌడ్ సలహాలు సూచనలు తీసుకుంటామని ప్రకటించారు.

దారి తప్పిన తెలంగాణను పట్టాలు ఎక్కించాలంటే అనుభవం కావాలన్నారు. ఆయన సూచనలు తీసుకుని తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం పనిచేస్తామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు కొల్లగొట్టినా పూర్తి కాలేదని రేవంత్ విమ‌ర్శించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని అదికారంలోకి తీసుకురావాల‌నే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి దూకుడు పెంచుతున్నారు. నిత్యం ఏదో ఒక కార్య‌క్ర‌మాలు చేస్తూ కాంగ్రెస్ లో జోష్ తెచ్చే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు.

Next Story
Share it