Telugu Gateway
Telangana

సినిమా షూటింగ్ ల ఛార్జీలు త‌గ్గించాలి

సినిమా షూటింగ్ ల ఛార్జీలు త‌గ్గించాలి
X

కరోనా మహమ్మారి కారణంగా ఏడాదికి పైనే సినిమా దియేటర్లు పూర్తిగా మూసి ఉన్నాయి. దీంతో సినిమా ఎగ్జిబిటర్స్, దియేటర్ల నిర్వహకులు ఆర్ధికంగా ఎంతో నష్టపోయార‌ని, ప్రభుత్వం ఈ కష్టకాలంలో వారికి అండగా నిలిచి ఆదుకోవాలని ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖులు మంత్రి త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్ ను క‌ల‌సి విన‌తిప‌త్రం అందించారు. ప్రధానంగా సినిమా దియేటర్లు మూసి ఉంచిన సమయానికి ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని, సింగిల్ స్క్రీన్ ధియేటర్ లలో వాహనాల పార్కింగ్ చార్జి వసూలు చేసే వెసులుబాటు కల్పించాలని, ఎస్ జీఎస్ టి ట్యాక్స్ ను రద్దు చేయాలని, జీవో 75 ను పునరుద్దరించాలన్నారు.

షూటింగ్ అనుమతులకు వసూలు చేసే చార్జీలను తగ్గించాలని తదితర డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో సునీల్ నారంగ్, అనుపమ్ రెడ్డి, అభిషేక్ నామా, సదానంద్ గౌడ్, బాల గోవింద్ రాజ్ తాడ్ల తదితరులు ఉన్నారు. సినీ ఎగ్జిబిటర్స్ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వీరికి హామీ ఇచ్చారు. . శనివారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో తెలంగాణా స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మంత్రిని క‌లిశారు.

Next Story
Share it