Telugu Gateway
Telangana

రాహుల్ జోడో యాత్ర తెలంగాణ కాంగ్రెస్ కు కిక్ ఇస్తుందా?!

రాహుల్ జోడో యాత్ర తెలంగాణ కాంగ్రెస్ కు కిక్ ఇస్తుందా?!
X

ఒక వైపు మునుగోడు ఉప ఎన్నిక, మరో వైపు కాంగ్రెస్ ఎంపీ, కాంగ్రెస్ స్టార్ ప్రచారకర్త కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుమారం. సొంత పార్టీ ని కాదని బీజేపీ నుంచి పోటీ చేస్తున్న తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కి ఓటు వేయాలని.. కాంగ్రెస్ పార్టీ గెలవదని అయన బహిరంగంగా వ్యాఖ్యానించటం తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర కు మొత్తంమీద పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. మరి తెలంగాణ లో రాహుల్ గాంధీ పాదయాత్ర ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అన్నది ఆసక్తి కరంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ రాహుల్ యాత్ర పై భారీ ఆశలే పెట్టుకుంది. మరి ఎలాంటి ఫలితాలు వస్తాయో వేచి చూడాల్సిందే.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆదివారంనాడు తెలంగాణ లోకి ప్రవేశించింది. ఇందులో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తో పాటు సీనియర్ నేతలు ఉత్తమకుమార్ రెడ్డి, మధు యాష్కీ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల నుంచి కూడా ఈ యాత్ర కు మంచి స్పందన ఉంది. అయితే దీపావళి సందర్భంగా యాత్ర కు మూడు రోజులు బ్రేక్ ఇస్తున్నారు. తిరిగి తెలంగాణ లో ఈ యాత్ర అక్టోబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణ లో రాహుల్ యాత్ర మొత్తంమీద 12 రోజులు, 375 కిలోమీటర్ల మేర సాగనుంది. అయితే ఈ యాత్ర ను తెలంగాణ కాంగ్రెస్ ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది అన్నది వేచిచూడాల్సిందే. నాయకుడు నిత్యం ప్రజల్లో ఉంటే ఆ ఫలితాలు సానుకూలంగానే ఉంటాయి. ఇప్పటికే ఈ విషయం చాలా సార్లు నిరూపితం అయింది. 2024 లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యాత్ర పై భారీ ఆశలే పెట్టుకుంది. త్వరలోనే కర్ణాటక, గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. కాంగ్రెస్ ఫ్యూచర్ కు ఇవి కూడా కీలకంగా మారనున్నాయి.

Next Story
Share it