Telugu Gateway
Telangana

అస్సాం సీఎంపై కేసు పెట్టిన రేవంత్

అస్సాం సీఎంపై కేసు పెట్టిన రేవంత్
X

కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్య‌లు చేసిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కేసు పెట్టారు. జూబ్లిహిల్స్ పోలీసు స్టేష‌న్ లో కాంగ్రెస్ నేత‌ల‌తో క‌ల‌సి వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కెసీఆర్ ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ధి ఉంటే అస్సాం సీఎంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అస్సాం సీఎం వ్యాఖ్య‌లు రాహుల్ ను కాద‌ని..అమ్మ‌ల‌ను అవ‌మానించిన‌ట్లేన‌న్నారు. అస్సాం సీఎంపై ఎన్నికల అధికారులు క్రిమినల్ కేసులు పెడతారని ఆశించామని... ప్రధాని నిస్సిగ్గుగా బిశ్వ శర్మ ను సమర్ధిస్తున్నారని మండిపడ్డారు.

అస్సాం సీఎంపై చర్యలు తీసుకోవడంలో ఆ రాష్ట్ర పోలీస్, ఎన్నికల వ్యవస్థలు విఫలం అయ్యాయన్నారు. బిశ్వ శర్మ వ్యాఖ్యలతో దేశంలోని మాతృమూర్తులకు అవమానం జరిగిందని తెలిపారు. అందుకే తాము ఇక్కడ కేసులు పెడుతున్నామని... వెంటనే అస్సాం సీఎంపై క్రిమినల్ కేసులు పెట్టి నోటీస్‌లు పంపాలని డిమాండ్ చేశారు. బిశ్వ శర్మను అరెస్ట్ చేసి తీసుకురావాలన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే దీని కోసం ఓ స్పెషల్ టీంను ఏర్పాటు చేయాలని తెలిపారు. చర్యలు తీసుకోకపోతే 16న పోలీస్ కమిషనర్, ఎస్పీ కార్యాలయాల ముందు నిరసన తెలుపుతామని రేవంత్ రెడ్డి తెలిపారు.

Next Story
Share it