Telugu Gateway
Telangana

కెసిఆర్ ఫ్యామిలిపై బాంబు పేల్చిన మోడీ

కెసిఆర్ ఫ్యామిలిపై బాంబు పేల్చిన మోడీ
X

ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు తెలంగాణాలో పర్యటించిన అయన పాలమూరు సభతో పోలిస్తే...నిజామాబాద్ లో తెలంగాణాలోని అధికార బిఆర్ఎస్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అంతే కాదు..తాను వంద శాతం నిజమైన అంశాలు కొన్ని చెప్పాలి అనుకుంటున్నా అని..సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసి ఎన్నికల తర్వాత తెలంగాణ సీఎం కెసిఆర్ ఒక సారి తనను కలిసి ఎన్ డిఏలో చేరతానని కోరారు అని...తాను ఎట్టి పరిస్థితుల్లో బిఆర్ఎస్ తో కలిసే ఛాన్స్ లేదు అని తేల్చిచెప్పినట్లు వెల్లడించారు. అంతే కాదు...తాను చేయాల్సిన పనులు చాలా చేశాను అని... మంత్రి కెటిఆర్ ను సీఎం చేద్దాం అనుకుంటున్నానని...ఒక సారి మీ దగ్గరకు పంపుతాను ఆశీర్వదించాలని కోరారు అంటూ సంచలన ప్రకటన చేశారు. ఫస్ట్ మీరు..తర్వాత మీ కొడుకుని సీఎం చేయటానికి ఇదేమైనా రాజరికమా...ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించినట్లు వెల్లడించారు. సీఎం సీటు లో ఎవరు కూర్చోవాలి...ఎవరు వద్దు అన్నది ప్రజలు నిర్ణయించాలి కానీ ఇలా కాదు అని చెప్పానన్నారు. అప్పటి నుంచి తన కళ్ళలోకి చూడటానికి కూడా కెసిఆర్ భయపడుతున్నారు అని తెలిపారు. తన నీడను చూడటానికి కూడా బయపడుతున్నాడు అన్నారు. కెసిఆర్ అవినీతి చిట్టా అంతా చెప్పినట్లు మోడీ ప్రకటించారు.

బిఆర్ఎస్ పాలనలో అంతా ఫ్యామిలి మాత్రమే బాగుపడింది అని..కెసిఆర్, అయన కొడుకు కేటీఆర్, కూతురు కవిత, అల్లుడు హరీష్ రావు లు కలిసి లూటీ చేస్తున్నారు అని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా బిఆర్ఎస్ సర్కారు దోచుకుంటుంది అని ఆరోపించారు. తెలంగాణాలో బిఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని...కుటుంబస్వామ్యంగా మార్చింది అని ఆరోపించారు. జీహెచ్ఎంసి ఎన్నికల తర్వాత తనపై ఎక్కడ లేని ప్రేమ చూపించారు అని...ఇది అసలు కెసిఆర్ అసలు క్యారెక్టర్ కాదు అన్నారు. జీహెచ్ఎంసిలో తమకు మద్దతు ఇవ్వాలని కెసిఆర్ కోరారు అని తెలిపారు. తాము ప్రతిపక్షంలో కూర్చుంటాం కానీ...ప్రజలు ఇచ్చిన తీర్పును వమ్ము చేయం అని చెప్పానన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవటానికి బిఆర్ఎస్ నిధులు సమకూర్చింది అని ఆరోపించారు. తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తే బిఆర్ఎస్ పాపాలు బయటపెడతామన్నారు. తెలంగాణాలో అధికార బిఆర్ఎస్, బీజేపీల మధ్య లాలూచీ ఉంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా వేళ ప్రధాని మోడీ చేసిన కామెంట్స్ మాత్రం ప్రాధాన్యత సంతరించుకున్నాయి అనే చెప్పాలి.

Next Story
Share it