Telugu Gateway
Telangana

పాత పద్దతిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్

పాత పద్దతిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్
X

హైకోర్టు ఆదేశాల ప్రకారం శుక్రవారం నుంచి తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ధరణి పోర్టల్ అంశంపై హైకోర్టు గురువారం నాడు కూడా విచారణ జరిపింది. ఈ సందర్భంగా కోర్టు తాము ఎలాంటి రిజిస్ట్రేషన్లపై స్టే ఇవ్వలేదని మరోసారి స్పష్టం చేసింది. వ్యవసాయేతర ఆస్తులను గతంలో మాదిరే కంప్యూటర్ ఆధారిత విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయమై గురువారం తెలంగాణ హైకోర్టు విచారించింది. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లకు అభ్యంతరం లేదన్న ధర్మాసనం తేల్చి చెప్పింది. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా సీఏఆర్‌డీ పద్దతి కొనసాగించాలని పిటిషన్‌ తరపు న్యాయవాదులు కోరగా.. ఆన్ లైన్ స్లాట్ బుకింగ్ గతంలో లాగా రిజిస్ట్రేషన్ చేసుకునే విదంగా చూడలని అడ్వొకేట్‌ జనరల్‌ విజ్ఞప్తి చేశారు.

రిజిస్ట్రేషన్‌కు ప్రాపర్టీట్యాక్స్‌ గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలని వాదించారు. హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వకుండా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్లను ఆపిందని పిటిషనర్‌ తరపు న్యాయవాదులు ధర్మాసనానికి వివరించారు. ధరణి వివరాలు మాత్రమే ఆపాలని చెప్పామని, రిజిస్ట్రేషన్‌పై ఎలాంటి స్టేలు ఇవ్వలేదని హైకోర్టు స్పష్టం చేసింది. స్లాట్‌ బుకింగ్‌తోపాటు పీటీఐఎన్‌(PTIN) పద్ధతిలోనే రిజిస్ట్రేషన్‌ చేయాలని సూచించింది. ధరణి పోర్టల్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అనంతరం తతుపరి విచారణను డిసెంబర్‌ 16కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్, కులం వివరాలు అడగబోమని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.

Next Story
Share it