Telugu Gateway
Telangana

మోడీ కంటే ముందు ఈడీ వస్తది..జైలు కు వెళ్ళటానికి అయినా రెడీ

మోడీ కంటే ముందు ఈడీ వస్తది..జైలు కు వెళ్ళటానికి అయినా రెడీ
X

ఢిల్లీ లిక్కర్ స్కాములో ఆరోపణలు ఎదుర్కుంటున్న ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవిత గురువారం ఉదయం మీడియా ముందుకు వచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై మాట్లాడారు. ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు వచ్చే ముందు మోడీ కంటే ముందు ఈ డీ వస్తదనే విషయం తెలిసిందే. వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు ఉన్నందున ఇది నార్మల్ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీ హీనమైన..నీచమైన ఎత్తుగడలను . పట్టించ్చుకోవాల్సిన అవసరం లేదు. మీడియా లో లీక్ లు ఇచ్చి పేరు చెడగొట్టాలని చుస్తే ప్రజలు తిప్పి కొడతారు. భయపడాల్సిన అవసరం లేదు. iమహా అయితే ఏమి చేస్తారు జైలు లో పెడతారా..పెట్టుకోండి. అంతకు మించి ఏమి చేస్తారు. ప్రజలు మనతో ఉన్నంత కాలం ఏమి కాదు. ప్రశ్నలు వేస్తే సమాధానము చెపుతాం. బీజేపీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంది. మీ ఫెయిల్యూర్స్ ను ఎత్తి చూపుతాం. మేము దేనికి భయపడటం లేదు. ఏజెన్సీలకు సహకరిస్తాం అంటూ తెలిపారు. ఎమ్మెల్సీ కవిత తాను చెప్పాల్సిన విషయాలు చెప్పి వెళ్లి పోయారు తప్ప..తన ఫోన్లు మార్చిన అంశం..వాటిని నాశనం చేసిన విషయం మాత్రం ఏమి మాట్లాడ లేదు, పూర్తిగా ప్రధాని మోడీ ని టార్గెట్ చేస్తూ మాట్లాడి వెళ్లారు.

Next Story
Share it