Telugu Gateway
Telangana

రియల్టర్ ను బెదిరించిన మంత్రి మల్లారెడ్డి

రియల్టర్ ను బెదిరించిన మంత్రి మల్లారెడ్డి
X

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. 'ఏభై ఎకరాల్లో వెంచర్ వేసి మంత్రి, ఎమ్మెల్యేను కలవవా?'. అంటూ రియల్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ కు ఇస్తే సరిపోతుందా? కలెక్టర్ కు చెప్పి పొట్టుపొట్టు చేపిస్తా. తనను కలిసే వరకూ వెంచర్ ఆపేయాలంటూ మంత్రి మల్లారెడ్డి రియల్టర్ కు వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఆడియో టేప్ దుమారం రేపుతోంది. వెంచర్ వేసిన వ్యక్తి నుంచి మామూళ్ళు ఇస్తే వెంచర్ ముందుకు సాగదంటూ వార్నింగ్ ఇఛ్చారు.

మంగళవారం ఉదయం నుంచి ఈ టేప్ మీడియా ఛానళ్లలోనూ ..సోషల్ మీడియాలోనూ హోరెత్తుతోంది. గతంలోనూ మల్లారెడ్డిపై కబ్జా ఆరోపణలు వచ్చాయి. తాజా ఆడియో టేప్ ఇంత హల్ చల్ చేస్తున్నా అధికార పార్టీ నుంచి దీనిపై ఎలాంటి స్పందనా లేదు. ఓ వైపు ఇఫ్పటికే కొంత మంది ఎమ్మెల్యేల పేర్లు డ్రగ్స్ వ్యవహారంలో వెలుగులోకి వస్తున్న తరుణంలో ఇఫ్పుడు..మల్లారెడ్డి బెదిరింపులు చర్చనీయాంశంగా మారాయి.

Next Story
Share it