Telugu Gateway
Telangana

డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా ఒమిక్రాన్

డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా ఒమిక్రాన్
X

తెలంగాణ స‌ర్కారు ఒమిక్రాన్ వైర‌స్ పై ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తోంది. ముఖ్యంగా ప్ర‌జ‌లంద‌రూ విధిగా మాస్క్ లు ధ‌రించాల‌ని..లేదంటే వెయ్యి రూపాయ‌లు జ‌రిమానా విధించ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఒమిక్రాన్ వైర‌స్ దేశంలోకి ఎప్పుడైనా రావొచ్చ‌న్నారు. ఒమిక్రాన్‌ వైరస్‌ ఇప్పటికే 20కి పైగా దేశాలలో వ్యాపించిన సంగతి తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో, ఆఫీసుల్లో మాస్క్‌ నిబంధన అమలయ్యేలా చూడాలని వైద్యారోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది. అదే విధంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు.. ఎక్కడికి వెళ్లిన వ్యాక్సినేషన్‌ పత్రం తప్పనిసరిగా అమలయ్యేలా చూస్తామన్నారు.

రిస్క్‌ దేశాల నుంచి హైదరాబాద్‌ వచ్చిన 325 మంది ప్రయాణికులకు పరీక్షలు చేయడం జరిగిందని.. వీరిలో 35 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని హెల్త్‌ డైరెక్టర్‌ తెలిపారు. ఆమెకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. అదే విధంగా, జీనోమ్‌ సిక్వెన్స్‌కి నమునాలు పంపించామని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకోవ‌టానికి జాగ్ర‌త్త‌లు పాటించ‌ట‌మే ఏకైక ఉత్త‌మ మార్గం అన్నారు. మూడు రోజుల్లోనే ఈ వైర‌స్ మూడు దేశాల నుంచి 24 దేశాల‌కు విస్త‌రించింద‌ని తెలిపారు.

Next Story
Share it