'లిక్కర్ స్కామ్' పై రేవంత్ మౌనం వెనక మతలబు ఏమిటి?!
![లిక్కర్ స్కామ్ పై రేవంత్ మౌనం వెనక మతలబు ఏమిటి?! లిక్కర్ స్కామ్ పై రేవంత్ మౌనం వెనక మతలబు ఏమిటి?!](https://telugugateway.com/h-upload/2022/08/24/1581762-rev.webp)
ఇందులో పెద్దగా ఏ పార్టీకి మినహాయిపు ఉండదు. అంతే కానీ..నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మాట్లాడాలనే సంప్రదాయం ఎప్పుడో వదిలేశారు. కానీ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటివరకూ లిక్కర్ స్కామ్ ఆరోపణలై మౌనం దాల్చటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీని వెనక మతలబు ఏమిటీ అన్న చర్చ కూడా నడుస్తోంది. అయితే ఇదే అంశంపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మధుయాష్కీ మాట్లాడారు. ఢిల్కీ లిక్కర్ స్కామ్ కంటే తెలంగాణలో జరిగింది మరింత పెద్ద స్కామ్ అంటూ ఆరోపణలు చేశారు. సహజంగా ఇతరుకు ఛాన్స్ ఇవ్వకుండా విమర్శలు గుప్పించే రేవంత్ రెడ్డి స్వయంగా సీఎం కెసీఆర్ కుమార్తెపై ఆరోపణలు వచ్చినా మౌనం దాల్చటం పలు విమర్శలకు దారితీస్తోంది.