Telugu Gateway
Telangana

కెటీఆర్ దగ్గరకు 'బిర్యానీ పంచాయతీ'!

కెటీఆర్ దగ్గరకు బిర్యానీ పంచాయతీ!
X

తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ కు ఓ విచిత్రమైన ఫిర్యాదు అందింది. అంతా కరోనా కష్టాల్లో..ఎవరి టెన్షన్ లో వాళ్లు ఉంటే ఓ నెటిజన్ మాత్రం కెటీఆర్ కు వింత ఫిర్యాదు చేశారు. ' ఎక్స్ ట్రా మసాలా..లెగ్ పీస్ తో నేను చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను. కానీ ఇందులో ఏదీ నాకు రాలేదు. జొమాటో ప్రజలకు సర్వీస్ చేసేది ఇలాగేనా?' అంటూ తోటకూరి రఘుపతి అనే నెటిజన్ ట్వీట్ చేస్తూ దీన్ని కెటీఆర్ కు ట్యాగ్ చేశారు. దీనిపై మంత్రి కెటీఆర్ స్పందించారు.

'బ్రదర్ ఇది నాకు ఎందుకు ట్యాగ్ చేశావు..దీనిపై నేను ఏమి చేయాలని కోరుకుంటున్నావు' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కెటీఆర్ ను ట్యాగ్ చేసిన ట్వీట్..దీనికి మంత్రి రిప్లయ్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఎవరికి తోచినట్లు వాళ్లు కామెంట్లు పెడుతూ పోతున్నారు. ఓ నెటిజన్ 'ఆస్క్ కెటీఆర్ ' అంటారుగా..అందుకే అడిగి ఉంటాడు అంటూ వ్యాఖ్యానించారు. మరో వ్యక్తి పిలిచి మసాలా దట్టించి పంపిస్తే సరిపోతుంది అంటూ చురకలంటించాడు.

Next Story
Share it