Telugu Gateway
Telangana

కెసీఆర్ రోడ్లపై అరిస్తే తెలంగాణ రాలేదు

కెసీఆర్ రోడ్లపై అరిస్తే తెలంగాణ రాలేదు
X

ముఖ్యమంత్రి కెసీఆర్, మంత్రి కెటీఆర్ లకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కులేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. వీళ్లు రోడ్లపై అరిస్తే తెలంగాణ రాలేదని..కాంగ్రెస్ పార్టీ చట్ట సభల్లో బిల్లు పెడితేనే తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకే ఉందని వ్యాఖ్యానించారు. నిత్యం అబద్ధాలతో...రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. 2024లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. భట్టి విక్రమార్క ఆదివారం నాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఇంత పెద్ద ప్రాజెక్టును అందించిన నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు రుణపడి ఉండాలని అన్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాజెక్టును కేసీఆర్ తన ధనదాహంతో రీ డిజైన్ పేరుతో దోపిడీకి తెరలేపారన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి 7 జిల్లాలకు మంచి నీరు, పరిశ్రమలకు నీటి సదుపాయంతో సహా 16 లక్షల ఎకరాలకు నీరు అందేదని భట్టి వివరించారు. కేసీఆర్ ధనదాహంతో నీళ్లు తెలంగాణలో పారకుండా రీ డిజైన్ పేరుతో అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ప్రాజెక్టు అంచనాలను విపరీరంగా పెంచి లక్షా పదిహేను వేల కోట్ల రూపాయలకు పెంచారని చెప్పారు. కేసీఆర్ అత్యాశ వల్ల తెలంగాణ నష్టపోతోందని అన్నారు.

Next Story
Share it