జూబ్లిహిల్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా సీవీ రావు
జూబ్లిహిల్స్ క్లబ్బు ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. కీలక పోస్టులకు ఒక్కొక్కరే నామినేషన్లు దాఖలు చేయటంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు అయింది. దీంతో క్లబ్ నూతన అధ్యక్షుడి గా సీ వీ రావు, ఉపాధ్యక్ష రాలు గా హిమబిందు, సెక్రటరీగా హనుమంతరావు, జాయింట్ సెక్రటరీగా జనార్ధన్ రెడ్డిగా ఎన్నికైనట్లే. పాలకమండలి సభ్యులుగా అమితారెడ్డి, తిరుపతి రావు, కిలారు రాజేశ్వరరావు, రమేష్ చౌదరీ, శివప్రసాద్ ,శ్రీనివాస రెడ్దీ,అశోక్ రావు, రవీంద్రనాథ్,సుభాష్, జగ్గారావు,వెంకట సుబ్బరాజులు ఉన్నారు.
నూతన కమిటీ రెండేళ్ల పాటుకొనసాగనుంది. ఈ నెల 19 న తొలిసమావేశం జరగనుంది. అయితే కొంత మంది అర్హుల నామినేషన్లు కూడా తిరస్కరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే మరి వీరి పోరాటం చేస్తారా..లేక జారుకుంటారా అన్నది కొంత కాలం ఆగితే కానీ తేలదు. గత సొసైటీ ఎన్నికల్లో విజయం సాధించిన రవీంద్రనాధ్ ప్యానల్ క్లబ్బు ఎన్నికల్లో చేతులెత్తేయటం కూడా ఈ ఎన్నిక ఏకగ్రీవం కావటానికి కారణంగా సభ్యులు చెబుతున్నారు.