Telugu Gateway
Telangana

భారత క్రికెటర్ల ను కలిసిన ఎన్టీఆర్

భారత క్రికెటర్ల ను కలిసిన ఎన్టీఆర్
X

ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఫుల్ ఖుషి ఖుషిగా ఉంది. సినిమా విడుదల అయి చాలా రోజులు అయినా నిత్యం ఈ సినిమా ఏదో ఒక రకంగా వార్తల్లో ఉంటోంది. తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఇదే పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీ లో ఆస్కార్ బరిలోనూ ఉంది. తాజాగా ఎన్టీఆర్ అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చారు. ఆయన భారత క్రికెటర్లను కలిశారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో హంగామా చేస్తున్నాయి. బుధవారం నాడు భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే హైదేరాబద్ లోని ఉప్పల్ స్టేడియం లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం భారత్ క్రికెట్ టీం హైదరాబాద్‌కు చేరుకుంది.

ఖరీదైన కార్ కలెక్షన్స్‌తో హైదరాబాద్ వాసి నజీర్ ఖాన్ అందరిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ నజీర్ ఖాన్‌కు టీం ఇండియా ప్లేయర్స్‌లో కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు. నజీర్ ద్వారా ఆయన ఇంట్లోనే ఎన్టీఆర్‌ను టీం ఇండియా ప్లేయర్స్ కలిశారు. ఎన్టీఆర్‌ని కలిసిన వారిలో సూర్యకుమార్ యాదవ్, శుబ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, యుజువేంద్ర చహల్, శార్దుల్ ఠాకూర్ ఉన్నారు. వీరు ఎన్టీఆర్ తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. యజువేంద్ర చాహల్, సూర్య కుమార్ లు ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫోటోలను ట్విట్టర్ వేడిగా షేర్ చేశారు. వీరిద్దరూ గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాదించటంపై ఎన్టీఆర్ కు అభినందనలు తెలిపారు.

Next Story
Share it