నియోజకవర్గాల ఎంపికతో పెరిగిన అనుమానాలు!
![నియోజకవర్గాల ఎంపికతో పెరిగిన అనుమానాలు! నియోజకవర్గాల ఎంపికతో పెరిగిన అనుమానాలు!](https://telugugateway.com/h-upload/2023/10/03/1790315-janasena.webp)
దీంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొమ్మిది సీట్లలో బరిలో నిలవనున్నారు. ఇందులో కూకట్ పల్లి, ఎల్ బి నగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పఠాన్ చెరువు, సనత్ నగర్, ఉప్పల్, మేడ్చల్ , మల్కాజిగిరి ఉన్నాయి. అంటే జనసేన పోటీ చేయనున్న ఈ 32 సీట్లలో పదిహేడు సీట్లు ఉమ్మడి ఖమ్మం, గ్రేటర్ పరిథిలోనే ఉన్నాయి. మిగిలినవి వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, పాలకుర్తి, హుస్నాబాద్, నర్సంపేట, స్టేషన్ ఘనపూర్, రామగుండం, మంథని, జగిత్యాల, నకిరేకల్, కోదాడ, హుజుర్ నగర్, మునుగోడు, ఖానాపూర్, నాగర్ కర్నూల్ ఉన్నాయి. ఈ నియోజకవర్గాల జాబితా చూస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేల్చి అధికార బిఆర్ఎస్ కు ఉపయోగ పడేందుకే వీటిని ఎంపిక చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది అని...దీని వెనక అధికార పార్టీ పెద్దలు ఉన్నారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా సాగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ లో ఏమి జరిగినా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు బిఆర్ఎస్ సర్కారు పై విమర్శలు చేసిన దాఖలాలు లేవు. దీంతో పాటు జనసేన ఎంపిక చేసుకున్న నియోజక వర్గాలు కూడా ప్రజల్లో అనుమానాలకు తావు ఇచ్చేలా ఉన్నాయని రాజాకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తెలంగాణాలో బరిలోకి దిగే పవన్ కళ్యాణ్ అధికార బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ను టార్గెట్ చేస్తారా లేక వేరే పార్టీలను టార్గెట్ చేస్తారా అన్నది వేచిచూడాల్సిందే.