Telugu Gateway
Telangana

మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, ఆఫీసులుపై ఐటి దాడులు

మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, ఆఫీసులుపై ఐటి దాడులు
X

అటాక్స్ ...అటాక్స్. తెలంగాణ లో గత కొన్నిరోజుల నుంచి ఈడీ, ఐటి శాఖల దాడులు జోరు అందుకున్నాయి. అయితే ఇది అంతా రాజకీయ కోణంలో సాగుతోందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పై ఐ టి దాడులు జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళవారం తెల్లవారు జాము నుంచి ఏకంగా 50 టీంలు ఈ దాడుల్లో పాల్గొంటున్నాయి. మంత్రి మల్లా రెడ్డి తో పాటు అయన అల్లుడు రాజ శేఖర్ రెడ్డి, మంత్రి కొడుకుల ఇళ్లలోనూ ఈ దాడులు కొనసాగుతున్నాయి. మల్లా రెడ్డికి విద్యా సంస్థలతో పాటు అయన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టినట్లు చెపుతున్నారు. మల్లా రెడ్డి భూ కబ్జాల పై గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి. కానీ ప్రభుత్వం వీటిని పెద్దగా పట్టించుకోలేదు. మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలతో పాటు వీరి కుటుంబ సభ్యుల ఇల్లు, ఆఫీసుల్లో కూడా ఐ టి దాడులు నడుస్తున్నాయి. దూలపల్లి లోని మల్లా రెడ్డి కాలేజీలో నగదు స్వాదీనం చేసుకుని...కౌంటింగ్ యంత్రాల ద్వారా ఈ నగదును లెక్కిస్తున్నట్లు చెపుతున్నారు. దాడులు పూర్తి అయినా తర్వాత ఎలాంటి వివరాలు వస్తాయనేది వేచి చూడాలి.

Next Story
Share it