Telugu Gateway
Telangana

నెక్స్ట్ ఐటి టార్గెట్ పవర్ సెంటర్ క్లోజ్ గా ఉన్న ఎమ్మెల్సీ?!

నెక్స్ట్ ఐటి టార్గెట్ పవర్ సెంటర్ క్లోజ్ గా ఉన్న ఎమ్మెల్సీ?!
X

ఆయనే నెక్స్ట్. ఇది ఇప్పుడు అధికార టిఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో హాట్ టాపిక్. ఎవరూ ఊహించని రీతిలో ఐటి శాఖ మంగళవారం నాడు మంత్రి మల్లారెడ్డి, అయన కుటుంబ సభ్యులు అందరి పై ఏక కాలంలో దాడులు చేసిన విషయం తెలిసిందే. బుధవారం నాడు కూడా ఇవి ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఐ టి దాడులకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బహిర్గతం కావాల్సి ఉంది. గత కొంత కాలంగా తెలంగాణ లో ఢిల్లీ మద్యం స్కాం తో పాటు. గ్రానైట్ అక్రమాలు, కేసినో డీల్స్ తదితర అంశాలపై ఈడీ, ఐ టి దాడులు వరసపెట్టి జరగుతున్న విషయం తెలిసిందే. అయితే మధ్యలో ఎమ్మెల్యేల కొనుగోలుకు మొయినాబాద్ ఫార్మ్ హౌస్ లో జరిగిన డీల్ తో అధికార టీఆర్ఎస్ దీని వెనక బీజేపీ ఉందని ఆరోపిస్తూ ఎటాక్ ప్రారంభించింది. దీంతో గత కొంత కాలంగా సాగుతున్న టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఇప్పుడు పీక్ కి చేరింది అని చెప్పుకోవచ్చు.రాజకీయంగా ఒక అవగాహనకు వస్తే తప్ప ఈ ఏడాది అంతా ఇవే సంఘటనలు రిపీట్ అవుతాయని చెపుతున్నారు.

మంత్రి మల్లారెడ్డి పై ఐటి దాడులు ముగిసిన తర్వాత ఒక కీలక ఎమ్మెల్సీ లక్ష్యంగా ఐటి దాడులు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ అధికార కేంద్రానికి అతి సన్నిహితంగా ఉన్న ఆయనపై దాడి చేస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆ ఎమ్మెల్సీ ఫైనాన్సియల్ డీల్స్ లో కొంత మంది పెద్దల రోల్ ఉందనే చర్చ నడుస్తోంది. అక్రమ నిధుల పార్కింగ్ కోసం రక రకాల మార్గాలు వెతికారని...అందులో భాగంగానే రాబోయే రోజుల్లో వరస ఐ టి దాడులు జరిగే అవకాశం ఉందని చెపుతున్నారు. మొత్తానికి ఎవరికివారు తమ దగ్గర ఉన్న అన్ని అస్త్రాలను వాడుతున్నారు. ఈ విషయం లో ఒకరిపై ఒకరు పై చేయి సాధించే ప్రయత్నాల్లో ఉన్నారు. మరి ఇందులో ఎవరు అంతిమ విజేతలు అవుతారు అన్నది చూడాల్సిందే.

Next Story
Share it