Telugu Gateway
Telangana

కరోనా బులెటిన్ రోజూ విడుదల చేయాల్సిందే

కరోనా బులెటిన్ రోజూ విడుదల చేయాల్సిందే
X

తెలంగాణ హైకోర్టు కరోనాకు సంబంధించి గురువారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి రోజూ కరోనా బులెటిన్ విడుదల చేయాల్సిందేనని స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా తెలంగాణ సర్కారు బులెటిన్ జారీని నిలిపివేసింది. దీంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైన సూచనలు కన్పిస్తున్నాయని, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నందున తెలంగాణలోనూ పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించింది.

ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమికూడకుండా చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతోపాటు సర్కారు వీలైనంత వేగంగా సీరం సర్వే చేయాలని సూచించింది. రాష్ట్రంలో ఇఫ్పటివరకూ జరిగిన కరోనా టెస్ట్ లకు సంబంధించిన వివరాలను కోర్టుకు అందజేసింది. ప్రస్తుతం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం, ఉందన్నారు. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.

Next Story
Share it