Telugu Gateway
Telangana

రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖలు

రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖలు
X

తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామం. పీసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖలు చేశారు. తాను పదవి నుంచి తప్పు కుంటే తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అంటే తాను అందుకు రెడీ అని స్పష్టం చేశారు. తాను కాకుండా ఎవరినైనా పీసిసి పదవి లో కుర్చోపెట్టినా పల్లకి మోయటానికి కూడా రెడీ అని తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన పని చేయటం తప్ప తనకు మరో ఎజెండా ఏమి లేదని అన్నారు. పది పనులు చేసినప్పుడు అందులో ఒకటి, రెండు తప్పులు జరిగితే జరిగి ఉండొచ్చు మనుషులు అన్నాక తప్పులు సహజం అన్నారు. అందరం కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతల శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ కీలక వ్యాఖలు చేశారు. గత కొంత కాలంగా రేవంత్ రెడ్డి టార్గెట్ గా సీనియర్ నేతలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్న వేళ పీసిసి ప్రెసిడెంట్ మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

తనకు ఎలాంటి బేషజాలు లేవని, సీనియర్ లు చెప్పే మాటలను పరిగణనలోకి తీసుకుని ముందుకు సాగుతాను అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. జానారెడ్డి లాంటి సీనియర్ల సలహాలతో ప్రతి ఇంటికి పార్టీ ని చేరువ చేసే ప్రయత్నం చేద్దామన్నారు. ఇందుకు అందరు కలసి రావాలని కోరారు. మరో వైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ పదవి నుంచి తప్పుకున్నట్లు చెపుతున్నారు. సీనియర్ లు అందరు అయన రేవంత్ రెడ్డి కి కొమ్ముకాస్తున్నారు అంటూ ఫిర్యాదులు చేశారు. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నివేదిక ఆధారంగా కొత్త ఇంచార్జి ను నియమించనున్నట్లు చెపుతున్నారు.

Next Story
Share it