Telugu Gateway
Telangana

బండి సంజయ్, అక్భరుద్దీన్ లపై కేసుల నమోదు

బండి సంజయ్, అక్భరుద్దీన్ లపై కేసుల నమోదు
X

ఉద్రిక్తలు రెచ్చగొట్టేలా మాట్లాడారనే అంశంపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్భరుద్దీన్, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు సుమోటాగా ఈ కేసులు పెట్టారు. ఎన్నికల ప్రచారంలో అక్భరుద్దీన్ మాట్లాడుతూ ఆక్రమణలు అని పేదల ఇళ్ళు కూల్చే సర్కారుకు దమ్ముంటే పీవీ నరసింహరావు, ఎన్టీఆర్ సమాధులు కూల్చాలంటూ సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన బండి సంజయ్ అదే జరిగిదే పది నిమిషాల్లో దారుస్సలాంను కూల్చేస్తామంటూ హెచ్చరించారు. ఐపీసీ 505 కింద కేసు ఎస్సార్‌ నగర్‌ పోలీసులు బండి సంజయ్ పై కేసు నమోదు చేశారు.

Next Story
Share it