బిఆర్ఎస్ కు ఎందుకీ పరిస్థితి!

ప్రతిపక్షంలో ఉండగా మెట్రో అలైన్ మెంట్ మార్చాల్సిందే అని కెసిఆర్ గట్టిగా వాదించారు. చారిత్రిక భవనం అయిన అసెంబ్లీ ముందు నుంచి మెట్రో వెళ్ళటానికి వీలు లేదని...పైగా ఇది తెలంగాణ అమరవీరుల స్థూపం మీదుగా పెట్టారు అని..ఇది సెంటిమెంట్ తో కూడుకున్న అంశం...సుల్తాన్ బజార్ ఒక చారిత్రకమైన వ్యవస్థ అది...దాన్ని ధ్వంసం చేయకుండా చూడాలన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కెసిఆర్ తాను చెప్పిన మాటలను పూర్తిగా విస్మరించి ముందు ఖరారు అయిన రూట్ లోనే మెట్రో కు ఓకే చేశారు. ఇప్పుడు బిఆర్ఎస్ సర్కారు హైదరాబాద్ మెట్రో క్రెడిట్ అంతా తమదే అన్నట్లు కలరింగ్ ఇస్తోంది అనే విమర్శలు ఉన్నాయి. పరిశ్రమలు..ఉద్యోగాలు అన్ని ఎక్కువ చేసి చూపించినట్లు ఇప్పుడు ఎన్నికల యాడ్స్ లో చివరకు మెట్రో ప్రయాణికుల సంఖ్యను కూడా ఎక్కువ చేసి చూపిస్తున్నారు.