Telugu Gateway
Telangana

హుజూరాబాద్ ద‌ళిత బందుకు మ‌రో 500 కోట్లు

హుజూరాబాద్ ద‌ళిత  బందుకు మ‌రో 500 కోట్లు
X

టార్గెట్ హుజూరాబాద్. నిధులన్నీ అటే. ఇప్ప‌టికే హుజూరాబాద్ ద‌ళిత బందు కోసం 500 కోట్ల రూపాయ‌లు విడుద‌ల చేసిన తెలంగాణ స‌ర్కారు..కొత్త‌గా మ‌రో 500 కోట్ల రూపాయ‌లు విడుద‌ల చేసింది. దీంతో మొత్తం ఈ ప‌థ‌కం అమ‌లుకు ఇప్ప‌టికే వెయ్యి కోట్ల రూపాయ‌లు కేటాయించిన‌ట్లు అయింది. హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలుకోసం మొత్తం 2000 కోట్ల నిధులు విడుదల చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు.. వారం రోజుల్లోపు మరో 1000 కోట్ల రూపాయ‌ల‌ను ప్రభుత్వం విడుదల చేయనున్నది.

దీంతో సిఎం కెసిఆర్ ప్రకటించిన రూ. 2000 కోట్ల నిధులు పూర్తి స్థాయిలో విడుదల కానున్నాయి. ఎన్నికల నోటిఫికేష‌న్ వ‌చ్చేలోగానే నిధుల విడుద‌ల పూర్తి చేసేలా అంతా ప‌క్కాగా ప్లాన్ చేశారు. ఎలాగైనా స‌రే హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో గెల‌వాల‌నే వ్యూహంతో ముందుకెళుతున్న స‌ర్కారు అన్ని ప‌థ‌కాల‌కు నిధులు ఆపేసి ఈ మొత్తాల‌ను ద‌ళిత‌బందుకే మ‌ళ్ళిస్తోంది. ఈ ప‌థ‌కంపై ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌లు వ‌స్తున్నా స‌ర్కారు మాత్రం ఎక్క‌డా వెన‌క‌డుగు వేయ‌టం లేదు.

Next Story
Share it