Telugu Gateway
Telangana

లాయర్ దంపతుల దారుణ హత్య

లాయర్ దంపతుల దారుణ హత్య
X

హైకోర్టు న్యాయవాది దంపతులు గట్టు నాగమణి, వామన్ రావులు దారుణ హత్యకు గురయ్యారు. ఓ కేసు విషయంలో మంథని కోర్టుకు హాజరై హైదరాబాద్ తిరిగి వెళుతున్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న వారిని మార్గమధ్యంలో అడ్డుకుని..కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో వారిద్దరూ ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మృతి చెందారు. రామగిరి వద్ద బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కుంట శ్రీనివాస్ తమపై దాడి చేసినట్లు వామన్ రావు తెలిపారు. పాతకక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

టీఆర్ఎస్ నాయకుడు కుంట శ్రీనివాస్‌ పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డారని న్యాయవాది సన్నిహిత వ్యక్తులు చెబుతున్నారు. హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న కుంట శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ హత్యల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై రామగుండం సీపీ సత్యనారాయణ స్పందించారు. అన్ని కోణాల్లో ఈ హత్యలపై విచారణ జరుపుతున్నామని, దుండగులను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని తెలిపారు. ఇందులో ఎంత పెద్ద వారు ఉన్నా వదిలిపెట్టే ప్రశ్నలేదన్నారు.

Next Story
Share it