పీసి ఘోష్ కమిషన్ పై హై కోర్ట్ తీర్పు

అన్ని పిటిషన్ లపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్ట్ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హై కోర్ట్ తీర్పుతో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఈ విషయంలో ఎలాంటి అడుగులు వేస్తుంది అన్నది కీలకంగా మారబోతోంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటై రెండున్నర సంవత్సరాలు కావస్తోంది. కానీ ఈ విషయంలో ఎలాంటి నిర్దిష్ట చర్యలు తీసుకోలేకపోయింది. తెలంగాణా హై కోర్ట్ ఏకంగా జస్టిస్ పీ సి ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదు అని కామెంట్స్ చేసింది అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడో తేడా ఉన్నట్లు కనిపిస్తోంది అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కారుకు బిఆర్ఎస్ హయాంలో జరిగిన ఈ ప్రాజెక్ట్ స్కాం విషయంలో చిత్తశుద్ధి ఏ మాత్రం లేదు అనే అనుమానాలు మొదటి నుంచి వ్యక్తం అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణంతో పీ సి ఘోష్ కమిషన్ కు ఇచ్చిన టర్మ్స్ అఫ్ రెఫరెన్సు లే అని చెప్పొచ్చు.



