Telugu Gateway
Telangana

రేవంత్ ఫ‌స్ట్..కెటీఆర్ సెకండ్

రేవంత్ ఫ‌స్ట్..కెటీఆర్ సెకండ్
X

ఇవేమీ స‌ర్వే ఫ‌లితాలు కావు సుమా. బంగారు తెలంగాణ చేసి భార‌త్ కు బ‌య‌లుదేరిన పార్టీ కీల‌క నేత‌, మంత్రి కెటీఆర్ ఇప్పుడు మునుగోడు ద‌త్త‌తు తీసుకోవ‌టం ఏమిటో. పాన్ ఇండియా పార్టీ ఇలా దేశంలో ఎన్ని నియోజ‌క‌వ‌ర్గాలు ద‌త్త‌త తీసుకోగ‌లుగుతుంది. ఇది ఉప ఎన్నిక‌ల స్పెష‌లా?. మునుగోడు కాకుండా కెటీఆర్ రాష్ట్రంలోని ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గం ఏదైనా ద‌త్త‌త తీసుకుంటే ఎవ‌రికీ పెద్ద‌గా అనుమానాలు వ‌చ్చి ఉండేవి కావు. వాస్త‌వానికి రాష్ట్ర స్థాయి నాయ‌కుడు..రాష్ట్ర మంత్రి రాష్ట్రాన్ని అంతా స‌మానంగా చూడాలి. కానీ ఇప్పుడేమో మంత్రి కెటీఆర్ మునుగోడును ద‌త్తత తీసుకుంటాన‌ని చెబుతున్నారు. మునుగోడుపై ఇప్పుడే ఎందుకు అంత ప్ర‌త్యేక ప్రేమ‌. అది కూడా టీఆర్ఎస్ ను గెలిపిస్తేనే అట. అంటే ఆయ‌న‌కు ప్రేమ నిజంగా మునుగోడు వెన‌క‌బాటుపై ఉందా?. లేక రాజ‌కీయ‌మా అంటే ఖచ్చితంగా రాజ‌కీయ‌మే అని స్ప‌ష్టం అవుతోంది.

ఇప్ప‌టికే ఓ నాయ‌కుడు..పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వ‌స్తే ద‌త్త‌త తీసుకంటాన‌ని ప్ర‌క‌టించారు. పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో ఈ హామీ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు కూడా. రేవంత్ రెడ్డి ఈ మాట చెప్పింది నిన్ననే అంటే బుధ‌వారం. కాంగ్రెస్ అంటే ఏదో క‌ష్టాల్లో ఉంది..రేవంత్ ఈ హామీ ఇచ్చార‌నుకుందాం. కెటీఆర్ ప‌రిస్థితి అలా కాదు క‌దా. అధికారంలో ఉన్నారు..అస‌లు తెలంగాణ మోడ‌ల్ దేశానికి చూపించాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న పార్టీ. ఈ పార్టీ అగ్ర‌నేత‌లు టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కెసీఆరేమో ఓ గ్రామం ఎన్నిక‌ల‌ బాధ్య‌త‌లు తీసుకున్నారు. ఇప్పుడు మంత్రి కెటీఆర్ మాత్రం గెలిపిస్తే మ‌నుగోడును ద‌త్త‌త తీసుకుంటానంటున్నారు. ఇవ‌న్నీ చూస్తున్న వారు టీఆర్ఎస్ ఎంత టెన్ష‌న్ లో ఉందో అర్ధం అవుతుంద‌నే వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అందుకే ఓ ఉప ఎన్నిక కోసం వంద మందిని ఆ నియోజ‌క‌వ‌ర్గంలో మోహ‌రించింది. అంతేకాదు గ‌తంలో తోక పార్టీలు అంటూ ఎద్దేవా చేసిన వారిని ఇప్పుడు ప‌క్క‌న పెట్టుకుని మ‌రీ నామినేష‌న్ వేశారు.

Next Story
Share it