Telugu Gateway
Telangana

నామా నాగేశ్వ‌ర‌రావుకు ఈడీ స‌మ‌న్లు

నామా నాగేశ్వ‌ర‌రావుకు ఈడీ స‌మ‌న్లు
X

బ్యాంకుల‌ను మోసం చేసిన కేసులో టీఆర్ఎస్ లోక్ స‌భా నేత నామా నాగేశ్వ‌ర‌రావుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైర‌క్ట‌రేట్ (ఈడీ) షాకిచ్చింది. కొద్ది రోజుల క్రిత‌మే నామాతో పాటు మ‌ధుకాన్ డైర‌క్ట‌ర్ల కార్యాల‌యాల్లో త‌నిఖీలు నిర్వ‌హించిన ఈడీ తాజాగా ఆయ‌న‌కు స‌మ‌న్లు జారీ చేసింది. ఈనెల 25న విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. బ్యాంకు రుణాలను మళ్లించిన కేసుకు సంబంధించిన ఈడీ నామాకు సమన్లు జారీ చేసింది. మధుకాన్‌ కేసులో నిందితులందరికీ ఈడీ సమన్లు జారీ చేసింది. సోదాల్లో హార్డ్‌డిస్క్‌లు, డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం చేసుకుంది.

Next Story
Share it