Telugu Gateway
Telangana

న‌న్ను చంపేందుకు కుట్ర‌..ఈటెల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

న‌న్ను చంపేందుకు కుట్ర‌..ఈటెల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం నుంచి పాద‌యాత్ర ప్రారంభించిన ఆయ‌న త‌న‌ను చంపేందుకు కుట్ర ప‌న్నార‌ని ఆరోపించారు. దీని కోసం హంత‌క‌ముఠాల‌తో చేతులు క‌లిపార‌నే స‌మాచారం త‌న‌కు వ‌చ్చింద‌ని అన్నారు. జిల్లా మంత్రే ఈ కుట్ర‌లుచేస్తున్నార‌ని ఆరోపించారు. న‌ర‌హంత‌కుడు న‌యీం చంపుతాన‌నంటే భ‌య‌ప‌డ‌లేద‌న్నారు. పాద‌యాత్ర‌లో భాగంగా శనిగ‌రంలో మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్య‌మంత్రి కెసీఆర్ ర‌జాకార్ల‌ను త‌ల‌పిస్తున్నార‌న్నారు. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని స‌ర్పంచ్ ల‌కు సీఎం వెల‌క‌ట్టార‌ని ఆరోపించారు. అరె కొడుకుల్లారా మీ చిల్ల‌ర ప్ర‌య‌త్నాల‌కు ఈటెల రాజేంద‌ర్ భ‌య‌ప‌డ‌డు అంటూ వ్యాఖ్యానించారు. 2018లో త‌న‌కు ఓడించేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ప్ర‌జ‌లు త‌న‌ను గెలిపించార‌ని..ఇప్పుడూ కూడా ప్ర‌జ‌లు త‌న‌కు అండ‌గా ఉంటార‌న్నారు. చ‌ట్టం మీద త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌న్నారు. అంత‌కు ముందు పాదయాత్ర ప్రారంభం సంద‌ర్భంగా మాట్లాడుతూ హుజూరాబాద్ లో ఓట‌మి త‌ప్ప‌ద‌ని తెలిసే సీఎం కెసీఆర్ చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. పాదయాత్రకు తెరాస ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తుందని విమర్షించారు.

ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. 'తాము ఎలాంటి ప్రలోభాలను నమ్ముకోలేదని.. ధర్మా‍న్ని, న్యాయాన్ని, ప్రజలను నమ్ముకున్నామని' పేర్కొన్నారు.కేసీఆర్‌ నియంతృత్వ పాలనకు చరమ గీతం పాడటం ఇక్కడి నుంచే మొదలవుతుందని అన్నారు. తమ పాదయాత్రకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని తెలిపారు. ​ ఈ పాదయాత్ర గురించి పదిరోజుల క్రితమే ప్రకటించామని పేర్కొన్నారు. హుజురాబాద్‌లో ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వ పథకాలు మీదగ్గర అమలు చేస్తున్నారా.. అని ప్రశ్నించారు. తన పాదయాత్రకు అండగా ఉండేందుకు అనేక వర్గాల ప్రజలు, అన్ని యూనివర్శిటీలు విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున వచ్చారని పేర్కొన్నారు. ఈ పాదయాత్ర 25-26 రోజుల పాటు ప్రతి పల్లెను, ప్రతి గడపను కలిసేలా సాగుతుందని వివరించారు.

Next Story
Share it