Telugu Gateway
Telangana

ఈటెల‌కు అస్వ‌స్థ‌త

ఈటెల‌కు అస్వ‌స్థ‌త
X

హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ‌లో వేడి రాజేస్తోంది. అస‌లు ఎన్నిక ఎప్పుడు జ‌రుగుతుందో తేలియ‌క‌పోయినా ప్ర‌చారం మాత్రం ఎప్పుడో మొద‌లైంది. అధికార పార్టీ మంత్రులు..ఎమ్మెల్యేలు కూడా అక్క‌డ మకాం వేసి ప్ర‌చారం చేస్తున్నారు. మ‌రో వైపు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ పాద‌యాత్ర చేస్తూ నియోజ‌క‌వ‌ర్గం అంతా క‌వ‌ర్ చేసే ప‌నిలో ఉన్నారు. ఆయ‌న పాద‌యాత్ర శుక్ర‌వారానికి 12వ రోజుకు చేరుకుంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అస్వస్థ‌త‌కు గుర‌య్యారు.

ఏ మాత్రం గ్యాప్ లేకుండా వ‌ర‌స‌గా పాద‌యాత్ర చేస్తుండ‌టంతో ఆయన ఆరోగ్యం క్షీణించింద‌న్నారు.. ఈ విషయాన్ని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తెలిపారు. జ్వరంతోపాటు కాళ్లనొప్పులతో ఈటల బాధపడుతున్నారని వెల్ల‌డించారు. ఈటెల 'ప్రజా దీవెన యాత్ర' పేరిట కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ నియోజకవర్గవ్యాప్తంగా పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే.

Next Story
Share it