Telugu Gateway
Telangana

గెల్లు శ్రీనివాస్ స్వ‌గ్రామంలోనూ ఈటెల‌కే ఆధిక్యం

గెల్లు శ్రీనివాస్ స్వ‌గ్రామంలోనూ ఈటెల‌కే ఆధిక్యం
X

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో వింతలు ఎన్నో. సీఎం కెసీఆర్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ద‌ళిత బంధు ప్రారంభించిన గ్రామం శాల‌ప‌ల్లిలో బిజెపి అభ్య‌ర్ధి ఈటెల రాజేంద‌ర్ కు ఎక్కువ ఓట్లు వ‌చ్చాయి. ఇప్పుడు టీఆర్ఎస్ అభ్య‌ర్ధి గెల్లు శ్రీనివాస‌యాద‌వ్ స్వ‌గ్రామం హిమ్మ‌త్ న‌గ‌ర్ లోనూ అదే సీన్ రిపీట్ అయింది. హిమ్మ‌త్ న‌గర్ లో ఈటెల రాజేంద‌ర్ కు 191 ఆధిక్యం వ‌చ్చింది. ఇక్క‌డ బిజెపికి మొత్తం 549 ఓట్లు రాగా, టీఆర్ఎస్ కు 358 ఓట్లు వ‌చ్చాయి. ఈ ప‌రిణామం ఆస‌క్తిక‌రంగా మారింది.

Next Story
Share it