Telugu Gateway
Telangana

450 కోట్ల‌తో మ‌ల్టీప్లెక్స్ క‌డుతున్న తెలంగాణ ఐఏఎస్ ఎవ‌రు?

450 కోట్ల‌తో మ‌ల్టీప్లెక్స్ క‌డుతున్న తెలంగాణ ఐఏఎస్ ఎవ‌రు?
X

దాసోజు శ్ర‌వ‌ణ్ సంచ‌ల‌న ట్వీట్

తెలంగాణ కు చెందిన కొంత మంది ఐఏఎస్ అధికారుల‌పై ఇటీవ‌ల కాలంలో తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గ‌త కొంత కాలంగా బీహార్ కు చెందిన అధికారుల‌కే తెలంగాణ‌లో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించి..అంద‌రూ క‌ల‌సి దోపిడీ చేస్తున్నార‌ని ప‌లుమార్లు ఆరోపించారు. తాజాగా ఏఐసీసీ అధికారి ప్ర‌తినిధి దాసోజు శ్ర‌వ‌ణ్ చేసిన ట్వీట్ సంచ‌ల‌నంగా మారింది. తెలంగాణ‌లో ప‌నిచేస్తున్న బీహార్ కు చెందిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి 450 కోట్ల రూపాయ‌ల‌తో భారీ మ‌ల్టీప్లెక్స్ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. అది కూడా గురుగామ్ లో ఈ ప్రాజెక్టు చేపట్టార‌ని..ఈ వ్య‌క్తి ఎవ‌రో తెలంగాణ తెలుసుకోవాల‌ని కోరుకుంటోంద‌ని వ్యాఖ్యానించారు. దాసోజు శ్ర‌వ‌ణ్ ఈ ట్వీట్ ను సీబీఐతోపాటు అవినీతి నిరోధ‌క శాఖ‌కు కూడా ట్యాగ్ చేశారు.

Next Story
Share it