Telugu Gateway
Telangana

క‌రోనా చికిత్స‌..ధ‌ర‌లు ఖ‌రారు చేసిన తెలంగాణ స‌ర్కారు

క‌రోనా చికిత్స‌..ధ‌ర‌లు ఖ‌రారు చేసిన తెలంగాణ స‌ర్కారు
X

హైకోర్టు ఆదేశాల‌తో తెలంగాణ స‌ర్కారు క‌రోనా చికిత్స‌కు సంబంధించిన ధ‌ర‌ల‌ను నిర్ణ‌యిస్తూ నూత‌న జీవో జారీ చేసింది. ఇప్ప‌టివ‌ర‌కూ కొత్త జీవో జారీ చేయ‌క‌పోవ‌టంపై కొద్ది రోజుల క్రితం కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. బుధ‌వారం నాడు వివిధ ధ‌ర‌ల‌ను నిర్ణ‌యిస్తూ ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి. కోవిడ్‌ సోకిన వారు సాధారణ వార్డులో ఐసోలేషన్‌, పరీక్షలకు రోజుకు గరిష్టంగా రూ.4 వేలు, ఐసీయూ గదిలో రోజుకు గరిష్టంగా రూ.7,500, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ గదికి రోజుకు గరిష్టంగా రూ.9 వేలు, పీపీఈ కిట్‌ ధర రూ.273కి మించరాదని ఆస్పత్రుల ఛార్జిలను ఖారారు చేశారు.

హెచ్‌ఆర్ సీటీ రూ.1995, డిజిటల్‌ ఎక్స్‌ రే రూ.1300, ఐఎల్‌6 రూ.1300 మాత్రమే ఛార్జ్‌ చేయాలని పేర్కొంది. అదే విధంగా డీ డైమర్‌ రూ.300, సీఆర్‌పీ రూ.500, ప్రొకాల్ సీతోసిన్ రూ.1400, ఫెరిటీన్‌ రూ.400, ఎల్‌డీహెచ్ రూ.140 ఛార్జీలను నిర్ణయించింది. సాధారణ జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్సుకు కిలోమీటరుకు రూ.75, కనీసం రూ.2వేలుగా, ఆధునిక జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్సుకు కిలోమీటరుకు రూ.125, కనీసం రూ.3వేలుగా ధరలను ప్రభుత్వం నిర్ణ‌యించింది.

Next Story
Share it