Telugu Gateway
Telangana

కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
X

జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. తాము గెలిస్తే ఏమి చేస్తామో అందులో చెప్పింది. కాంగ్రెస్ కు మేయర్ పీఠం దక్కితే వరద బాధితులకు రూ.50 వేల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించింది. వరదల్లో చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, పూర్తిగా దెబ్బతిన్న గృహాలకు ఇస్తామంది. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్‌ మాణికం ఠాగూర్‌ విడుదల చేశారు. గ్రేటర్‌లో గెలిస్తే.. ఉచితంగా 30 వేల లీటర్ల మంచి నీటిని అందిస్తామన్నారు.

ప్రదాన హామీలు ఇలా ఉన్నాయి.. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తాం. మెట్రో, ఎంఎంటీఎస్‌ సర్వీసులు పాతబస్తీ, శంషాబాద్‌ వరకు విస్తరింపు. మెట్రో, ఎంఎంటీఎస్‌లో మహిళలు, వృద్ధులకు ఉచిత ప్రయాణం. అర్హత కలిగిన అందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు. 100 యూనిట్ల లోపు గృహాలకు కరెంట్ ఉచితం. 80గజాలలోపు ఉన్న ఇళ్లకు ట్యాక్స్ రద్దు. ఉచితంగా 30వేల లీటర్ల మంచి నీరు. జీహెచ్‌ఎంసీ లైబ్రరీలలో దివ్యాంగులకు ఉద్యోగాలు.' వంటి హామీలను ప్రకటించారు.

Next Story
Share it