Telugu Gateway
Telangana

క‌ల్న‌ల్ సంతోష్ బాబు విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌

క‌ల్న‌ల్ సంతోష్ బాబు విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌
X

చైనా సైనికుల‌తో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో అమ‌రుడైన క‌ల్న‌ల్ సంతోష్ బాబు విగ్ర‌హాన్ని మంగ‌ళ‌వారం నాడు తెలంగాణ ప‌రిశ్ర‌మ‌లు, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ ఆవిష్క‌రించారు. గత ఏడాది గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికులకు మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్‌ సంతోష్‌బాబు అమరుడైన సంగతి తెలిసిందే. సూర్యాపేటలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన 10 అడుగుల క్యాంస విగ్రహాన్ని కేటీఆర్‌ ఆవిష్కరించారు.

అనంతరం కోర్ట్ చౌరస్తాకు కల్నల్ సంతోష్ బాబు చౌరస్తాగా నామకరణం చేశారు.ఈ కార్యక్రమంలో సంతోష్‌బాబు తల్లిదండ్రులతో​ పాటు ఆయన సతీమణి, ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య, చిరుమర్తి లింగయ్య యాదవ్‌లతో పాటు ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పాల్గొన్నారు.

Next Story
Share it