Telugu Gateway
Telangana

ముఖ్యమంత్రి కెసీఆర్ కు కరోనా పాజిటివ్

ముఖ్యమంత్రి కెసీఆర్ కు కరోనా పాజిటివ్
X

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారికంగా వెల్లడించారు. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉన్నా యని ఆయన వెల్లడించారు. ఫాంహౌస్‌లో ప్రత్యేక వైద్యబృందం పరిశీలనలో సీఎం కెసీఆర్ ఉన్నారు. వైద్యుల సలహా మేరకు ఆయన ఐసోలేషన్ లో ఉన్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఇంకా రావాల్సి ఉంది. స్వల్ప జ్వరంతోపాటు జలుబు ఉండటంతో పరీక్షలు నిర్వహించగా..కరోనా పాజిటివ్ అని తేలింది.

అయితే సీఎం కెసీఆర్ ఆరోగ్యం పూర్తి నిలకడగా ఉందని ఆయన్ను పరిశీలిస్తున్న డాక్టర్ ఎం వీ రావు తెలిపారు. సీఎం కెసీఆర్ ఇటీవల నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. తాజాగా సీఎం కెసీఆర్ కంటే ముందు సాగర్ అభ్యర్ధి నోముల భగత్ తోపాటు మరికొంత మంది అధికార పార్టీ నేతలకు కూడా కరోనా వైరస్ సోకింది.

Next Story
Share it