Telugu Gateway
Telangana

ఈటెల భూకబ్జాలు.. విచారణకు సీఎం కెసీఆర్ ఆదేశం

ఈటెల భూకబ్జాలు.. విచారణకు సీఎం కెసీఆర్ ఆదేశం
X

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై తెలంగాణ ముఖ్య మంత్రి కార్యాలయం స్పందించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. 'మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని భూములు కబ్జాకు గురయ్యాయనే విషయంలో తనకు అందిన ఫిర్యాదును పురస్కరించుకుని వెంటనే దర్యాప్తు జరిపి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ ద్వారా తెప్పించాలన్నారు.

ఆ నివేదికను అందచేయాల్సిందిగా సిఎస్ సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ భూముల విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుదేల్చాల్సిందిగా విజిలెన్స్ డిజి పూర్ణచందర్ రావు ని సిఎం అదేశించారు. సత్వరమే ఇందుకు సంబంధించి ప్రాధమిక నివేదికను అందజేసి అనంతరం సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికలను అందజేయాల్సిందిగా సిఎం ఆదేశాలు జారీ చేశారు.' అని పేర్కొన్నారు.

Next Story
Share it