Telugu Gateway
Telangana

కెసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారు

కెసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారు
X

ముఖ్య‌మంత్రి కెసీఆర్ కు ఎలాంటి స‌మ‌స్య‌లు లేవ‌ని..ఆయ‌న బాగానే ఉన్నార‌ని య‌శోదా ఆస్ప‌త్రి వైద్యుడు ఎం వీ రావు వెల్ల‌డించారు. శుక్ర‌వారం నాడు సీఎం కెసీఆర్ అక‌స్మికంగా అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వెంట‌నే హుటాహుటిన సోమాజిగూడ‌లోని య‌శోదా ఆస్ప‌త్రికి వెళ్లి వైద్య ప‌రీక్షలు చేయించుకున్నారు. యాంజియోగ్రామ్ తో పాటు స్కానింగ్ లు చేశారు. ఈ ప‌రీక్షల్లో ఎలాంటి బ్లాక్ లు లేవ‌ని గుర్తించారు. ఈ విష‌యాన్ని డాక్ట‌ర్ ఎంవీ రావు తెలిపారు.

గ‌త రెండు రోజులుగా ఎడ‌మ చేయి, ఎడ‌మ కాలు నొప్పిగా ఉంద‌ని తెలిపార‌న్నారు. సాధార‌ణ ప‌రీక్షల్లో భాగంగా అన్ని టెస్ట్ లు చేశారు. కెసీఆర్ తోపాటు ఆస్ప‌త్రికి ఆయ‌న భార్య‌, కూతురు క‌విత‌, ఎంపీ సంతోష్ రావులు కూడా వ‌చ్చారు. అనంత‌రం మంత్రులు కెటీఆర్, హ‌రీష్ రావులు కూడా ఆస్ప‌త్రికి చేరుకున్నారు. వాస్త‌వానికి ఆయ‌న శుక్ర‌వారం నాడు యాదాద్రికి వెళ్ళాల్సి ఉంది. అనారోగ్యంతో ఉండ‌టంతో ఈ ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకున్నారు.

Next Story
Share it